Hyderabad,telangana, మే 11 -- జింక మాంసాన్ని కొనుగోలు చేసిన ముగ్గురు వ్యక్తులు హైదరాబాద్ లో అరెస్ట్ అయ్యారు. మహారాష్ట్ర నుంచి మాంసాన్ని తీసుకువచ్చినట్లు గుర్తించారు. టోలిచౌకికి చెందిన హసన్ బక్రాన్, నిజామాబాద్ కు చెందిన హమీద్ బిన్ హకానీ, మెహిదీపట్నానికి చెందిన షేక్ అబ్దుల్ రహమాన్ ను నిందితులుగా గుర్తించారు.

పోలీసులు విచారణలో కీలక విషయాలు వెలుగు చూశాయి. చోలిచౌకికి చెందిన బక్రాన్ వద్ద. జింక మాంసం ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. హకానీ నుంచి మాంసాన్ని కొనుగోలు చేసి.. అందులో కొంత మొత్తాన్ని తన స్నేహితుడు షేక్ అమూదితో పంచుకున్నట్లు తేలింది.

నిందితుల్లో ఒకరిగా ఉన్న హమీద్ బిన్ హకానీ.. మహారాష్ట్రకు చెందిన రిజ్వాన్ అనే వ్యక్తి నుంచి మాంసాన్ని కొనుగోలు చేసినట్లు విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు. స్వాధీనం చేసుకున్న మాంసాన్ని పోలీసులు... అటవీశ...