Hyderabad, సెప్టెంబర్ 24 -- తెలుగులో హారర్, యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన సినిమా ఎర్రచీర - ది బిగినింగ్. బేబి డమరి సమర్పణలో శ్రీ పద్మాయల ఎంటర్‌టైన్‌మెంట్స్, శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించింది. ఎర్రచీర - ది బిగినింగ్" సినిమాలో నటుడు రాజేంద్ర ప్రసాద్ మనవరాలు బేబీ సాయి తేజస్విని కీలక పాత్ర పోషించింది.

"ఎర్రచీర - ది బిగినింగ్" మూవీకి సుమన్ బాబు స్వీయ దర్శకత్వం వహిస్తూ ఒక ముఖ్య పాత్ర పోషించారు. హార్రర్, యాక్షన్‌కు మదర్ సెంటిమెంట్ యాడ్ చేసిన కథగా ఈ సినిమా తెరకెక్కింది. ఎర్రచీర బిజినెస్ షో చూసిన తర్వాత డిస్ట్రిబ్యూటర్లందరూ అద్భుతంగా ఉందని ప్రశంసించారు.

ఎర్రచీర సినిమాను డిస్ట్రిబ్యూట్ చేసేందుకు ముందుకు వచ్చారు. ఈ సినిమా డివోషనల్ టచ్ ఉన్న కంటెంట్ కావడంతో ఎర్రచీర మూవీని దీపావళి కానుకగా వారం ముందే అంటే అక్టోబర్...