భారతదేశం, జూన్ 8 -- కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజా సమాచారం ప్రకారం.. భారతదేశంలో యాక్టివ్ కోవిడ్-19 కేసుల సంఖ్య ఆదివారం నాటికి 6,000 మార్కును దాటింది. గత రెండు రోజుల్లో 769 కొత్త ఇన్ఫెక్షన్లు నమోదయ్యాయి. ప్రస్తుతానికి భారతదేశంలో 6,133 యాక్టివ్ కోవిడ్ కేసులు ఉన్నాయి. 24 గంటల్లో ఆరు మరణాలు సంభవించాయని మంత్రిత్వ శాఖ తెలిపింది. కేరళలో అత్యధిక సంఖ్యలో యాక్టివ్ కేసులు నమోదవుతున్నాయి. తరువాత గుజరాత్, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ ఉన్నాయి.

ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం.. కేరళలో 1950 యాక్టివ్ కేసులు ఉండగా, నిన్నటి నుండి రెండు మరణాలు నమోదయ్యాయి. గుజరాత్‌లో మొత్తం యాక్టివ్ కేసులు 822, బెంగాల్‌లో 693, ఢిల్లీలో 686 ఉన్నాయి. మహారాష్ట్ర, కర్ణాటకలో వరుసగా 595, 366 కేసులు నమోదయ్యాయి. నిన్నటి నుండి కర్ణాటకలో రెండు మరణాలు సంభవించగా, తమిళనాడులో ఒకరు మరణించ...