భారతదేశం, మే 20 -- బ్ర‌హ్మ‌ముడి సీరియ‌ల్‌లో కావ్య పాత్ర ద్వారా తెలుగు ప్రేక్ష‌కుల‌కు చేరువైంది దీపికా రంగ‌రాజు. ఈ సీరియ‌ల్‌తోనే ఆమె తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ధైర్యం, అమాయ‌క‌త్వం, తెలివితేట‌లు క‌ల‌బోసిన ఇల్లాలి పాత్ర‌లో నాచుర‌ల్ యాక్టింగ్‌తో అద‌ర‌గొడుతోంది. ఇటీవ‌ల దీపికా రంగ‌రాజు కాక‌మ్మ క‌థ‌లు అనే టాక్ షోలో పాల్గొన్న‌ది. హీరోయిన్ తేజ‌స్వి మ‌దివాడ హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తోన్న ఈ షోలో త‌న కెరీర్ గురించి ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను పంచుకున్న‌ది దీపికా రంగ‌రాజు.

యాక్టింగ్ కెరీర్ విష‌యంతో త‌న‌ను ఎవ‌రో స‌పోర్ట్ చేయ‌లేద‌ని, ఫ్యామిలీ, ఫ్రెండ్స్ నుంచి ఎలాంటి మోటీవేష‌న్ , హెల్స్ ల‌భించ‌లేద‌ని కావ్య‌ అన్న‌ది. నేను చ‌దువుకొని ఐటీ జాబో, గ‌వ‌ర్న‌మెంట్ జాబో చేయాల‌ని మా త‌ల్లిదండ్రులు ఇప్ప‌టికీ కోరుకుంటున్నార‌ని చెప్పింది. నీ యాక్టింగ్ బాగుంది, కెరీర్ ప‌...