భారతదేశం, జూలై 29 -- బీసీలకు 42 శాతం రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆగస్టు 4, 5, 6 తేదీలలో 72 గంటల నిరాహార దీక్షను ప్రకటించారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించే ఈ నిరసన రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలపై బీసీ బిల్లును ఆమోదించేలా ఒత్తిడి తీసుకురావడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు కవిత తెలిపారు.
'బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం పోరాడుతున్న మా ఎజెండా బీసీలకు రాజకీయ అధికారం కల్పించడం.'అని కవిత అన్నారు. గతంలో 2018 పంచాయతీ రాజ్ చట్టానికి సవరణ చేయాలని తెలంగాణ జాగృతి డిమాండ్ చేయడం వల్లే రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసిందన్నారు.
గవర్నర్ కు సంబంధించిన పెండింగ్ బిల్లులు, సమస్యలపై తెలంగాణ ప్రభుత్వం కోర్టులను ఆశ్రయించడానికి ఎందుకు విముఖత చూపుతోందని కవిత ప్రశ్నించారు. తమిళనాడులో, గవర్నర్ నిర్ణయం ఆల...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.