భారతదేశం, ఏప్రిల్ 29 -- బచావో కర్రెగుట్టల పేరుతో.. భద్రతా బలగాలు దూసుకెళ్లాయి. దాదాపు ఏడు రోజులుగా జల్లెడ పడుతున్నాయి. భారీ సంఖ్యలో మావోయిస్టులు ఉన్నారనే సమాచారంతో సాయుధ బలగాలు ముందుకెళ్లినా.. ఫలితం లేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే.. మావోయిస్టులు కావాలనే భద్రతా బలగాలను కర్రెగుట్టల వైపు రప్పించారా.. బలగాల దృష్టి మరల్చి మరో ప్రాంతానికి వెళ్లారా అనే చర్చ జరుగుతోంది. మావోయిస్టులు మరేదో వ్యూహం పన్నారనే చర్చ నడుస్తోంది.

రెండు వారాల కిందట మావోయిస్టులు ఓ లేఖను విడుదల చేశారు. తమ రక్షణ కోసం కర్రెగుట్టల్లో బాంబులు అమర్చామని.. ఆదివాసీలు ఇటువైపు రావొద్దని హెచ్చరించారు. ఆ లేఖ కాస్త చర్చనీయాంశంగా మారింది. అయితే.. రాజ్యానికి బలం ఎక్కువ అని తెలిసి.. తాము ఉన్నచోటును మావోయిస్టులు ఎందుకు చెప్తారనే ప్రశ్న ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆ లేఖ ద్వారా బల...