భారతదేశం, ఫిబ్రవరి 18 -- పసిడి మార్కెట్లో అనిశ్చితి కొనసాగుతోంది. గత కొంతకాలంగా ఆకాశాన్ని తాకిన బంగారం, వెండి ధరలు ఇప్పుడు భారీగా కిందికి దిగివచ్చాయి. బుధవారం (ఫిబ్రవరి 18) ఎంసీఎక్స్ (MCX) ట్రేడింగ్లో ఏప్రిల్ గోల్డ్ కాంట్రాక్టులు 10 గ్రాములకు Rs.1,52,719 వద్ద ట్రేడ్ అయ్యాయి. ఇది గతంలో నమోదైన ఆల్టైమ్ రికార్డు గరిష్టం Rs.1,93,096 తో పోలిస్తే దాదాపు Rs.40,000 (21%) తక్కువ.
ఇక వెండి పరిస్థితి మరింత ఘోరంగా ఉంది. కిలో వెండి తన గరిష్ట స్థాయి Rs.4,20,048 నుండి ఏకంగా Rs.1,88,000 (45%) పతనమై ప్రస్తుతం తక్కువ ధరల వద్ద కదలాడుతోంది.
భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు తగ్గడం (ముఖ్యంగా అమెరికా-ఇరాన్ చర్చల పురోగతి), డాలర్ విలువ పెరగడం, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల తగ్గింపుపై నెలకొన్న అంచనాలు ఈ ఒడిదుడుకులకు ప్రధాన కారణాలుగా నిపుణులు విశ్లేషిస్తున్నారు....
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.