భారతదేశం, మే 14 -- దిగ్గజ ఆటోమొబైల్​ సంస్థ నిస్సాన్​ తీవ్ర సంక్షోభంలోకి జారుకుంది! మార్చ్​తో ముగిసిన ఆర్థిక ఏడాదిలో అతిపెద్ద నష్టాలను నమోదు చేసింది. 25ఏళ్లల్లోనే అత్యధిక నష్టాలను నమోదు చేయడంతో కాస్ట్​ కటింగ్​ చర్యలను ప్రకటించి 7 ఫ్యాక్టరీలు మూసివేస్తున్నట్టు, 20వేలకుపైగా ఉద్యోగులను తొలగిస్తున్నట్టు వెల్లడించింది.

మార్చ్​తో ముగిసిన ఆర్థిక ఏడాదిలో నిస్సాన్​ ఏకంగా 670.9 బిలియన్​ యెన్​ల నష్టాన్ని నమోదు చేసింది. అంతేకాదు, 2026 ఆర్థిక ఏడాదికి సంబంధించి ఆపరేటింగ్​ ప్రాఫిట్​ అంచనాలను కూడా చెప్పేందుకు వెనకాడింది!

ఫ్రెంచ్​ కార్ల తయారీ సంస్థ రెనాల్ట్​.. నిస్సాన్​ని దివాళా నుంచి ఆదుకున్న 25ఏళ్లల్లో పరిస్థితులు ఈ స్థాయిలో దిగజారిపోవడం ఇదే తొలిసారి.

భారీ నష్టాల నేపథ్యంలో నిస్సాన్​ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రస్తుతం 17గా ఉన్న ఫ్యాక్టరీల సంఖ్యను ...