భారతదేశం, ఫిబ్రవరి 20 -- మనం హోటల్ నుంచి బిర్యానీ లేదా కర్రీస్ ఆర్డర్ చేసినప్పుడు ఎక్కువగా నల్లటి ప్లాస్టిక్ డబ్బాల్లో వస్తుంటాయి. అవి చూడటానికి స్టైలిష్‌గా, గట్టిగా ఉండటంతో చాలామంది వాటిని కడిగి ఇంట్లో మళ్లీ వాడుతుంటారు. కొందరైతే వాటిని మైక్రోవేవ్ ఓవెన్‌లో కూడా పెడుతుంటారు. కానీ, ఇవే మీ ఆరోగ్యానికి పెద్ద ముప్పుగా మారుతున్నాయని హెచ్చరిస్తున్నారు ప్రముఖ పోషకాహార నిపుణులు డాక్టర్ నందిత అయ్యర్.

అప్లైడ్ న్యూట్రిషన్‌లో ఫెలోషిప్ పొంది, దాదాపు 18 ఏళ్ల అనుభవం ఉన్న డాక్టర్ నందిత.. ఇటీవల సోషల్ మీడియా వేదికగా ఈ నల్లటి ప్లాస్టిక్ కంటైనర్ల వెనుక ఉన్న చేదు నిజాలను బయటపెట్టారు.

సాధారణ ప్లాస్టిక్ కంటే నల్లటి ప్లాస్టిక్ ఎందుకు ప్రమాదకరమో డాక్టర్ నందిత వివరించారు. "నల్లటి ప్లాస్టిక్ కంటైనర్లు సాధారణంగా రీసైకిల్ చేసిన ప్లాస్టిక్ వ్యర్థాల నుంచి తయారవుతాయి....