భారతదేశం, ఫిబ్రవరి 9 -- మంజీర ఫేజ్-2 నీటి లైన్లలో పెద్ద లీకేజీల కారణంగా హైదరాబాద్‌లోని అనేక ప్రాంతాల్లో నీటి సరఫరాకు అంతరాయం కలిగించాయి. ఫిబ్రవరి 11 నుండి 12 వరకు మరమ్మతు పనులు చేపడతామని, ఈ సమయంలో కొన్ని ప్రాంతాలకు తక్కువ నీటిని విడుదల చేస్తామని లేదా మరికొన్ని ప్రాంతాలకు సరఫరాను పూర్తిగా ఆపేస్తామని HMWSSB(హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డ్) తెలిపింది.

మంజీర ఫేజ్-2 నీటి లైన్లకు పెద్ద లీకేజీతో ఈ సమస్య వచ్చినట్టుగా అధికారులు చెబుతున్నారు. దీనితో కొన్ని ప్రాంతాలకు, ముఖ్యంగా పటాన్‌చెరు నుండి హైదర్‌నగర్ వరకు, కలబ్‌గూర్ నుండి పటాన్‌చెరు వరకు నీటి సరఫరా నిలిచిపోతుంది. రాంచంద్రాపురం, అశోక్ నగర్, జ్యోతి నగర్, లింగంపల్లి, చందానగర్, గంగారం, మదీనాగూడ, మియాపూర్, ఎర్రగడ్డ, ఎస్‌ఆర్ నగర్, అమీర్‌పేట్, కేపీహెచ్‌బీ కాలనీ, కూకట్‌పల్లి, భ...