భారతదేశం, ఫిబ్రవరి 11 -- ప్రభుత్వ ఉద్యోగుల కోసం తెలంగాణ ప్రభుత్వం మరో కొత్త ఆలోచన చేస్తోంది. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, విశ్రాంత ఉద్యోగులకు త్వరలోనే కొత్త హెల్త్ స్కీమ్ ను అమలు చేయాలని భావిస్తోంది. ఇప్పటికే ప్రాథమికంగా కసరత్తు పూర్తి కాగా.. ఉద్యోగ సంఘాలతో చర్చించి నిర్ణయాన్ని ప్రకటించనుంది.

ఫిబ్రవరి 12వ తేదీన(గురువారం) ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఆరోగ్యశ్రీ ట్రస్టు సీఈవో ఇతర ఉన్నతాధికారులతో పాటు పలు ఉద్యోగ సంఘాలు ఈ భేటీకి హాజరుకానున్నారు. ప్రస్తుతం అమల్లో ఉన్న పథకంలో ఉన్న ఇబ్బందులను చర్చించి.. కొత్త పథకంలో తీసుకురావాల్సి మార్పులపై చర్చిస్తారు.

ప్రభుత్వ ఉద్యోగుల కోసం అమలు చేయబోయే ఈ పథకాన్ని 'న్యూ ఎంప్లాయీస్‌ హెల్త్‌ స్కీమ్'గా వ్యవహరించే అవకాశం ఉంది. ఈ పథకాన్ని అమలు చేసేందుకు ఎంప్లాయ్ హెల్త్‌ కేర్‌ ట...