భారతదేశం, జూన్ 22 -- దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పహల్గామ్​ ఉగ్రదాడి కేసులో బిగ్​ అప్డేట్​! ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ఎన్​ఐఏ (జాతీయ దర్యాప్తు బృందం).. తాజాగా ఇద్దరిని అరెస్ట్​ చేసింది. పహల్గామ్​ దాడికి పాల్పడిన ఉగ్రవాదులకు ఈ ఇద్దరు ఆశ్రయం కల్పించినట్టు తెలుస్తోంది.

జమ్ముకశ్మీర్​లోని పహల్గామ్​లో ఏప్రిల్​ 22న ఉగ్రదాడి జరిగిన విషయం తెలిసిందే. కొందరు ఉగ్రవాదులు టూరిస్ట్​లు ఉన్న చోటకు చొరబడి కాల్పులకు తెగించారు. పురుషులను.. వారి మతం అడిగి మరీ కాల్చిచంపారు. మహిళలను విడిచిపెట్టి "వెళ్లి మోదీకి చెప్పు" అని అన్నారు. ఈ ఉగ్రదాడిలో 26మంది అమాయక భారతీయులు ప్రాణాలు కోల్పోయారు.

పహల్గామ్​ ఉగ్రదాడికి ఆపరేషన్​ సిందూర్​తో భారత్​ ప్రతీకారం తీర్చుకుంది. పాకిస్థాన్​, పాక్​ ఆక్రమిత కశ్మీర్​లోని ఉగ్రవాద స్థావరాలను టార్గెట్​ చేసి, ధ్వంసం చేసింది. తదనంతర ప...