Telangana, మే 2 -- తెలంగాణలోని రిజిస్ట్రేషన్ల శాఖలో సరికొత్త మార్పులు వచ్చిన సంగతి తెలిసిందే. పైలెట్ ప్రాజెక్ట్ గా పలుచోట్ల స్లాట్ బుకింగ్ విధానం అమల్లోకి వచ్చింది. మొత్తం 22 సబ్ రిజిస్ట్రాన్ కార్యాలయాల్లో ఈ విధానంలోనే రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. ఏప్రిల్ 10వ తేదీ నుంచి ప్రారంభించిన ఈ సేవలు. విజయవంతం కావటంతో ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.

రిజిస్ట్రేషన్ల శాఖలో తీసుకువచ్చిన స్లాట్‌ విధానాన్ని మరో 25 కార్యాలయాల్లో తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. మే 12వ తేదీ నుంచి ఈ సేవలను ప్రారంభించనున్నట్లు తెలిపింది. ఈ సేవలను అమలు చేసే రిజిస్ట్రేషన్ల కార్యాలయాలను కూడా ఖరారు చేసింది.

సెకండ్ ఫేజ్ లో భాగంగా శేరిలింగంపల్లి, ఉప్పల్, ఘట్‌కేసర్, నారపల్లి, మల్కాజిగిరి, ఫరూఖ్‌నగర్, షాద్‌నగర్, మహేశ్వరం, వనస్థలిపురం, వనపర్తి, గద్వాల, గజ్వేల్, సిద్ది...