Telangana,warangal, మే 10 -- మిస్‌ వరల్డ్‌ పోటీలు షురూ కానున్నాయి. ఇవాళ హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో ఘనంగా ప్రారంభం కానున్నాయి.ఈ వేడుకలకు 110కి పైగా దేశాలకు చెందిన సుందరీమణులు పాల్గొంటున్నారు. మే 31 వరకు ఈ పోటీలు కొనసాగనున్నాయి. ఇందులో భాగంగా.. తెలంగాణ సంస్కృతి, కళలు, సంప్రదాయాలను ప్రమోట్ చేసే దిశగా పలు కార్యక్రమాలు జరగనున్నాయి.

మరోవైపు ప్రపంచ అందగత్తెల పోటీల హాజరయ్యే అతివల రాక కోసం వరంగల్ కోట ముస్తాబవుతోంది. ఈ నెల 14న మిస్‌ వరల్డ్ ప్రతినిధుల టీమ్ వరంగల్ కు రానుండగా.. వారి సందర్శనార్థం కాకతీయుల రాజధానిగా వెలుగొందిన వరంగల్ కోటను సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. ఈ మేరకు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో లైటింగ్ వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నారు. ఇంకో నాలుగు రోజుల్లోనే మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ వరంగల్ కు రానుండగా.. గ్రేటర్ వరం...