భారతదేశం, జూన్ 2 -- ఎన్బీఈఎంఎస్ నీట్ పీజీ 2025ను వాయిదా వేసింది. దీనికి సంబంధించి బోర్డు అధికారిక నోటీసు జారీ చేసింది. దీనిలో 'మరిన్ని పరీక్షా కేంద్రాలు, అవసరమైన మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడానికి పరీక్షను వాయిదా వేస్తున్నాం.' అని తెలిపింది.

మెుదట జూన్ 15, 2025న నిర్వహించాల్సి ఉండేది. అయితే నీట్ పీజీ 2025ను రెండు షిఫ్టుల్లో కాకుండా సింగిల్ షిఫ్ట్‌లో నిర్వహించాలని సుప్రీంకోర్టు గత నెలలో ఆదేశించింది. ఒకే షిఫ్టులో పరీక్ష నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని, పూర్తి పారదర్శకత పాటించేలా చూడాలని ధర్మాసనం అధికారులను ఆదేశించింది. నీట్-పీజీ 2025 పరీక్షను రెండు షిఫ్టుల్లో నిర్వహించాలన్న నోటిఫికేషన్‌ను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ మీద విచారణ జరిపిన ధర్మాసనం ఈ ఆదేశాలు జారీ చేసింది.

నీట్ పీజీ 2025 నిర్వహణకు సవరించిన తేదీని త్వరలోనే ప్రకటిస్తామని ఎన్‌బీఈ...