భారతదేశం, ఫిబ్రవరి 20 -- నిన్ను కోరి సీరియల్ టుడే ఫిబ్రవరి 20 ఎపిసోడ్ లో.. శాలిని ఇంట్లో ఉండటం భరించలేనని క్రాంతి చెప్తాడు. నేను మారాను క్రాంతి. నమ్మమని శాలిని రిక్వెస్ట్ చేస్తుంది. మీ అమ్మ ఇలా చెప్పమందా? వీళ్లు అమాయకులు, నమ్మినట్లు చెప్తే మోసపోతారని చెప్పిందా? అని క్రాంతి అంటుండగానే కార్లో నుంచి ఓ మహిళ దిగుతుంది.

నీకో విషయం చెప్పనా నా ఫ్యామిలీ ఎంత చెప్పినా నేను మారను. ఎందుకంటే నువ్వు మారవు అని శాలినిని క్రాంతి నెట్టేస్తాడు. అప్పుడే లోపలికి వచ్చిన శాలిని తల్లి సునంద తన బిడ్డను పట్టుకుంటుంది. వీళ్లనా నువ్వు బతిమిలాడుతున్నావని సునంద అంటుంది. ఏం ఎంట్రీ ఇచ్చారు సునంద గారు. ఎక్స్ పెక్ట్ చేశా. అమ్మ నీ మీద విషం చిమ్మడానికి నీ వియ్యంకురాలు వచ్చిందని క్రాంతి అంటాడు.

ఏం సునందా ఎదురు నిలబడే ధైర్యం లేక నీ కూతురిని ఎరగా వేశావా? అసలు నువ్వు తల్లివేనా...