భారతదేశం, ఫిబ్రవరి 18 -- నిన్ను కోరి సీరియల్ టుడే ఫిబ్రవరి 18 ఎపిసోడ్ లో.. అత్తయ్య మీరు దేవతలా కనిపిస్తున్నారు. ఈ కేక్ తినండని శ్రుతి లోపలికి వెళ్లి బాధపడుతున్నట్లు కూర్చుంటుంది. రాజ్ వచ్చి కేక్ కట్ చేద్దామంటే, కేక్ లేదుగా మీ అమ్మ తినేసిందని శ్రుతి చెప్తుంది. అమ్మా కేక్ ఎందుకు తిన్నావని రాజ్ అడుగుతాడు. తల్లిపై మండిపడతాడు.

రూ.1000 కేక్ అది. మొత్తం తినేశావా? వాలెంటైన్స్ డే అని కేక్ తెచ్చా. ఏం తల్లివే నువ్వు అని రాజ్ అంటాడు. రాజ్ ను సరోజ కొడుతుంది. కేక్ మొత్తం అదే తిని, చిన్న ముక్క ఇచ్చి అత్తయ్య అని ప్రేమ ఒలకబోసిందని సరోజ చెప్తుంది. శ్రుతిని ఏం చేయలేమని రాజ్, సరోజ అనుకుంటారు.

క్రాంతి అలా చేస్తాడని ఊహించలేదు. శాలిని పశ్చాత్తాపంతో తప్పులను సరిద్దిద్దుకోవాలని ప్రయత్నిస్తోంది. కానీ క్రాంతి కోపం తగ్గడం లేదని జగదీశ్వరితో రఘురాం అంటాడు. శాలిని చే...