భారతదేశం, జనవరి 29 -- బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ రాణి ముఖర్జీ అప్పుడప్పుడు చేసే వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారుతుంటాయి. తాజాగా ఇంటి వాతావరణం, దంపతుల మధ్య ఉండాల్సిన సంబంధంపై రాణి ముఖర్జీ చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు నెట్టింట పెద్ద చర్చకు తెరలేపాయి. భర్తలపై భార్యలు గొంతు పెంచి మాట్లాడాలని రాణి అనడంపై నెటిజన్లు పెదవి విరుస్తున్నారు.

బాలీవుడ్ హంగామాకు ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో రాణి ముఖర్జీ సమాజంలో లింగ సమానత్వం గురించి మాట్లాడారు. ముఖ్యంగా ఒక బాలుడు తన తల్లిని తన తండ్రి ఎలా చూస్తున్నాడో గమనిస్తూ పెరుగుతాడని, తండ్రి ప్రవర్తనే కొడుకు వ్యక్తిత్వాన్ని మలుస్తుందని రాణి ముఖర్జీ అభిప్రాయపడ్డారు.

"గౌరవం అనేది ఇంటి నుంచే మొదలవుతుంది. ఇంట్లో తల్లిని తండ్రి సరిగ్గా చూడకపోతే, బయట అమ్మాయిలను కూడా అలాగే చూడవచ్చని అబ్బాయిలు భావిస్తారు. కాబట్టి...