భారతదేశం, నవంబర్ 25 -- బాలీవుడ్ యాక్టింగ్ లెజెండ్ ధర్మేంద్ర ప్రస్థానం ముగిసింది. ఆయన నట ప్రయాణం చివరి మజిలీకి చేరుకుంది. ధర్మేంద్ర సోమవారం (నవంబర్ 24) కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయన మరణం హిందీ సినీ పరిశ్రమ అంతటా నివాళులు, జ్ఞాపకాల ప్రవాహాన్ని ప్రేరేపించింది. చాలా మంది నటులు, దర్శకులు దివంగత నటుడికి హృదయపూర్వక సందేశాలు రాశారు. అమితాబ్ బచ్చన్ కూడా ఫుల్ ఎమోషనల్ అయ్యారు.
1970లు, 80లలో ధర్మేంద్రకు తరచుగా సహనటుడిగా ఉన్న అమితాబ్ బచ్చన్ కూడా తన బ్లాగ్లో తన స్నేహితుడికి హృదయపూర్వక నివాళి అర్పించారు. 'షోలే'లో ధర్మేంద్రతో కలిసి నటించిన ఈ సూపర్ స్టార్ తన బ్లాగ్లో ఇలా రాసుకొచ్చారు.
"మరో వీరోచిత దిగ్గజం మనల్ని విడిచిపెట్టి, యుద్ధభూమిని విడిచి వెళ్ళిపోయారు. భరించలేని శబ్దంతో నిశ్శబ్దాన్ని వదిలి వెళ్లారు" అని అమితాబ్ కన్నీళ్లు పెట్టించేలా రాసుకొచ్చా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.