భారతదేశం, ఫిబ్రవరి 20 -- సోషల్ మీడియాలో గత కొన్ని నెలలుగా కోలీవుడ్ స్టార్ ధనుష్, టాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ డేటింగ్ చేస్తున్నారని, త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నారనే వార్తలు విపరీతంగా వైరల్ అయ్యాయి. అయితే తన లేటస్ట్ మూవీ 'దో దీవానే సెహెర్ మే' (Do Deewane Seher Mein) ప్రమోషన్స్‌లో భాగంగా 'మిర్చి ప్లస్'కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మృణాల్ ఈ రూమర్లకు చెక్ పెడుతూ అసలు నిజం ఏంటో బయటపెట్టింది.

గతేడాది జులైలో ఆనంద్ ఎల్ రాయ్, కృతి సనన్‌ తో కలిసి ధనుష్ నటిస్తున్న 'తేరే ఇష్క్ మే' సినిమా రాపప్ పార్టీకి మృణాల్ ఠాకూర్ హాజరైంది. ఆ తర్వాత ఆగస్టులో మృణాల్ నటించిన 'సన్ ఆఫ్ సర్దార్ 2' (Son of Sardaar 2) మూవీ ప్రీమియర్‌కు ధనుష్ ముఖ్య అతిథిగా వచ్చాడు. వీరిద్దరూ ఇలా ఒకరి ఈవెంట్లకు ఒకరు హాజరుకావడంతో డేటింగ్ రూమర్స్ మొదలయ్యాయి. ఇవి కాస్తా ముదిరిపోయి ఏకంగా ఈ ఏడాది...