భారతదేశం, జూలై 17 -- భారత్లోని అమెరికా రాయబార కార్యాలయం అమెరికా వీసా దరఖాస్తుదారుల కోసం కొత్త అడ్వైజరీని విడుదల చేసింది. యునైటెడ్ స్టేట్స్లో ఉన్నప్పుడు దాడి, దొంగతనం పాల్పడవద్దని రాయబార కార్యాలయం ఎక్స్లో పోస్ట్ చేసింది. 'యునైటెడ్ స్టేట్స్లో దాడి, దోపిడీకి పాల్పడటం మీకు చట్టపరమైన సమస్యలను కలిగించడమే కాదు. ఇది మీ వీసా రద్దుకు దారితీస్తుంది. భవిష్యత్తులో యూఎస్ వీసాలకు మిమ్మల్ని అనర్హులుగా చేస్తుంది.' అని పేర్కొంది.
శాంతి భద్రతలకు అమెరికా విలువ ఇస్తుందని, విదేశీ సందర్శకులు అన్ని అమెరికా చట్టాలను పాటించాలని ఆశిస్తున్నట్లు రాయబార కార్యాలయం తెలిపింది. దొంగతనం చేస్తూ పట్టుబడిన భారతీయ మహిళ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అమెరికా రాయబార కార్యాలయం ఈ హెచ్చరిక చేసింది. భారతీయ మహిళ అమెరికాలోని ఓ షాప్లో దొంగతనాలకు పాల్పడుతూ పట్టుబడింది. 1000 డ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.