భారతదేశం, మే 18 -- వొడాఫోన్ ఐడియా (వీఐ) అత్యంత ఖరీదైన ప్రీపెయిడ్ ప్లాన్‌ను తీసుకొచ్చింది. ఈ ప్లాన్ ధర ఏడాదికి రూ.4999. ఇది వ్యక్తిగత ప్లాన్. అంటే రూ.4999 ప్లాన్ కేవలం ఒక కస్టమర్ కోసం మాత్రమే. ఇంకా ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ ప్లాన్‌తో వినియోగదారులు రోజుకు 2జీబీ డేటాను మాత్రమే పొందుతున్నారు.

అయితే ఈ ప్రీపెయిడ్ ప్లాన్‌తో కొన్ని బెస్ట్ ఓటీటీ బెనిఫిట్స్ అందుబాటులో ఉన్నందున దీని ధర ఎక్కువగా ఉంది. అంతేకాదు కంపెనీ తన 5జీ నెట్‌వర్క్ ఉన్న ప్రాంతాల్లో ఈ ప్లాన్‌తో వినియోగదారులకు అపరిమిత 5జీ డేటాను కూడా అందిస్తోంది. దేశంలోని అత్యంత ఖరీదైన రూ.4999 ప్లాన్‌లో కస్టమర్లకు ఎలాంటి ప్రయోజనాలు లభిస్తాయో తెలుసుకుందాం.

ఈ ప్లాన్‌ను వీఐ వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. వీఐ రూ.4999 ప్రీపెయిడ్ ప్లాన్ రోజుకు 2జీబీ డేటా, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లతో పాటు అపరిమిత వాయిస్ కాలింగ్...