భారతదేశం, ఫిబ్రవరి 12 -- ఉన్నత ఆశయాలు, ఉదాత్త లక్ష్యాలతో ఆంధ్రప్రదేశ్‌లో మొదలైన గ్రామ-వార్డు సచివాలయ వ్యవస్థ దారితప్పింది. తాజా దుస్థితిని ఇలాగే అనుమతిస్తే ఆర్థిక భారంతో పాటు మరిన్ని విపరిణామాలకు దారి తీసే ప్రమాదముంది. లోతుగా సమీక్షించి, తప్పిదాలను వెంటనే సరిదిద్దితే తప్ప ఆశించిన ప్రయోజనాలు నెరవేరవు. సంకుచిత రాజకీయ దృష్టి కోణంలో కాకుండా గ్రామస్వరాజ్య స్ఫూర్తితో సంస్కరణలు చేపట్టాలి. విస్తృత‌, ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసి, సిఫారసులను నిజాయితీగా అమలు చేయాలి. పాలన వికేంద్రీకరణ, సేవల విస్తరణ, పథకాల్లో పారదర్శకత, సమస్యల పరిష్కారం అన్న బహుముఖ లక్ష్యాల సాధనకు ప్రజాస్వామ్య ప్రభుత్వం కట్టుబడాలి.

ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ-వార్డు సచివాలయ వ్యవస్థ పనితీరు పరిశీలనకు 'పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ బృందాలు ఉత్తరాన ఇచ్ఛాపురం నుంచి దక్షిణాన తడ వరకు గ్రామాల...