భారతదేశం, ఫిబ్రవరి 24 -- ప్రతి తల్లిదండ్రులు కూడా తమ పిల్లలు బాగా చదువుకోవాలని, చదువులో రాణించాలని, తెలివితేటలు కలగాలని కోరుకుంటారు. అలాంటప్పుడు దక్షిణామూర్తి పూజ చేయడం వలన పిల్లలకు శుభ ఫలితాలు కలుగుతాయి. చదువులో బాగా రాణించడానికి కూడా వీలవుతుంది. దక్షిణామూర్తి పూజ చేయడం వలన అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. ఈ పూజ ఏ విధంగా చేసుకోవాలి? ఎవరు చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయి? అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.

పిల్లలకు కనపడే విధంగా దక్షిణామూర్తి చిత్రపటం ఇంట్లో పెట్టడం వలన పిల్లలు బాగా చదువుకుంటారు. పిల్లల్లో తెలివితేటలు పెరుగుతాయి. ముందుంటారు. చురుకుగా మారతారు. చదువులో మీ పిల్లలు కాస్త వెనకబడినా, లేక చదివినది మర్చిపోతున్నా సరే, ఇది సహాయపడుతుంది. విద్యాబుద్ధులు కూడా కలుగుతాయి.

ప్రతిరోజు పిల్లలకు దక్షిణామూర్తి ఫోటోకి దండం పెట్టించండి. అలాగే దీపారాధ...