భారతదేశం, ఆగస్టు 25 -- భువనేశ్వర్: విమాన ప్రయాణాలకు కొత్త కళను తీసుకురావడానికి కేంద్ర పౌర విమానయాన శాఖ సిద్ధమైంది. దేశంలో నిలిచిపోయిన 'సీప్లేన్' (సముద్ర విమానం) సేవలను అక్టోబర్ నాటికి కనీసం రెండు మార్గాల్లో తిరిగి ప్రారంభించనున్నట్లు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు సోమవారం తెలిపారు. పౌర విమానయాన రంగంలో భారత్ను ప్రపంచంలో అగ్రగామిగా నిలపడమే లక్ష్యంగా అనేక సంస్కరణలు చేపడుతున్నట్లు ఆయన వెల్లడించారు.
భువనేశ్వర్లో జరిగిన తూర్పు ప్రాంత పౌర విమానయాన మంత్రుల సదస్సులో ఆయన మాట్లాడుతూ... "సీప్లేన్ సేవలు గతంలో ఉన్నప్పటికీ, అవి ఒకే ఒక మార్గానికి పరిమితం అయ్యాయి. ఇప్పుడు ప్రభుత్వం ఈ విమానాలను నడపడానికి మార్గదర్శకాలను సులభతరం చేసింది. అక్టోబర్ నాటికి అండమాన్ & నికోబార్, కేరళ లేదా ఆంధ్రప్రదేశ్ నెట్వర్క్లో రెండు సీప్లేన్ సర్వీసులు అందుబాటులోకి వస్తాయన...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.