భారతదేశం, మే 14 -- మ‌ల‌యాళం మూవీ జాక్స‌న్ బ‌జార్ యూత్ తెలుగులోకి వ‌చ్చింది. డైరెక్ట్‌గా ఓటీటీలో ఈ సినిమా రిలీజైంది. జ‌క్సాన్ బ‌జార్ గ్యాంగ్ పేరుతో డ‌బ్ అయిన ఈ మూవీ సైనా ప్లే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. క్రైమ్ పొలిటిక‌ల్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కిన ఈ మూవీలో ల‌క్‌మ‌న్ అర‌వ‌న్‌, జాఫ‌ర్ ఇడుక్కి, ఇంద్రాస్ కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. షామ‌ల్ సులేమాన్ ఈ మూవీకి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

2023లో మ‌ల‌యాళంలో జాక్స‌న్ బ‌జార్ గ్యాంగ్ మూవీ థియేటర్ల‌లో రిలీజైంది. తెలుగులోకి మాత్రం రెండేళ్ల త‌ర్వాత వ‌చ్చింది. వ‌య‌లెన్స్‌కు ఎక్కువ‌గా ప్రాధాన్య‌మిస్తూ ద‌ర్శ‌కుడు ఈ సినిమాను తెర‌కెక్కించారు. ఈ సినిమాలోని యాక్ష‌న్ ఎపిసోడ్స్‌, పోలీసులు ఇంట‌రాగేష‌న్స్ సీన్స్‌లో హింస‌, ర‌క్త‌పాతం ఎక్కువ‌గా ఉంద‌నే కామెంట్స్ వినిపించాయి. స్టార్ కాస్ట్ లేకుండా కొత్త న‌టీన‌టుల‌తో ప్ర‌య...