Hyderabad,telangana, మే 7 -- తెలంగాణలో ఈసెట్ - 2025కుసంబంధించి కీలక అప్డేట్ వచ్చేసింది. ఎంట్రెన్స్ ఎగ్జామ్ హాల్ టికెట్లు అందుబాటులోకి వచ్చాయి. మే 12వ తేదీన ఈసెట్ ఎగ్జామ్ జరగనుంది. టీజీ ఈసెట్ అధికారిక వెబ్ సైట్ నుంచి హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవాలని అధికారులు ఓ ప్రకటన ద్వారా తెలిపారు.

టీజీ ఈసెట్ - 2025 ఎంట్రెన్స్ ద్వారా బీఈ, బీటెక్‌, బీఫార్మసీ కోర్సుల్లో 2025-26 విద్యా సంవత్సరానికి ప్రవేశాలను కల్పిస్తారు. డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులతో పాటు బీఎస్సీ మ్యాథ్స్‌ డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు ఈసెట్‌ ప్రవేశ పరీక్ష రాయవచ్చు. ర్యాంక్ ఆధారంగా సీట్ల కేటాయింపు ఉంటుంది.

ఈ ఏడాది ఈసెట్ - 2025 పరీక్షను ఉన్నత విద్యామండలి తరపున ఉస్మానియా యూనివర్శిటీ నిర్వహిస్తోంది. ఇప్పటికే దరఖాస్తుల ప్రక్రియ ముగిసింది. మే 12వ తేదీన ఎగ్జామ్ కు ఏర్పాట్లు సిద్ధం చేయ...