భారతదేశం, ఫిబ్రవరి 9 -- తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన ప్రచారం ముగిసింది. ప్రచారానికి చివరిరోజైన సోమవారం ఓటర్ల దృష్టిని ఆకర్షించడానికి ప్రధాన పార్టీలు పెద్ద ఎత్తున ర్యాలీలు, ప్రదర్శనలు చేశాయి. ముఖ్యనేతలంతా జనాల్లో ఉన్నారు. సాయంత్రం ప్రచారం ముగియడంతో మైకులు బంద్ అయ్యాయి. ఫిబ్రవరి 11న ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. ఫిబ్రవరి 13న ఉదయం 8 గంటల నుండి ఓట్ల లెక్కింపు జరుగుతుంది.

మూడు ప్రధాన రాజకీయ పార్టీల నాయకులు మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు బహిరంగ సభలలో ప్రసంగించారు. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు ర్యాలీలలో పాల్గొని బీఆర్ఎస్‌ను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

బీజేపీ తరఫున కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్...