భారతదేశం, ఫిబ్రవరి 9 -- లైంగిక వేధింపుల చేసేవారిపై కఠిన శిక్షలు అమలు చేస్తున్నా.. చాలా మందిలో మార్పు కనిపించడం లేదు. చిన్నారులపై కూడా దారుణాలు పెరిగిపోతున్నాయి. కొందరు వ్యక్తులు అభంశుభం తెలియని పిల్లల జీవితాలను నాశనం చేస్తున్నారు. తాజాగా తెలంగాణలో 8 ఏళ్ల బాలికపై బంధువులు అత్యాచారం చేశారు. బాలిక ఏడుస్తూ తల్లిదండ్రులకు చెప్పడంతో విషయం బయటకు వచ్చింది. పూర్తి వివరాళ్లోకి వెళ్తే..

తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఎనిమిదేళ్ల బాలికపై ఆమె బంధువులు ఇద్దరు అత్యాచారం చేశారు. అందులో ఒకరు మైనర్ అని కూడా పోలీసులు తెలిపారు. ఈ అఘాయిత్యాలు వేర్వేరు సమయాల్లో జరిగాయని అధికారులు వెల్లడించారు. ఈ దారుణాలు ఒకటి గత వారం జరగ్గా.. మరొకటి ఆదివారం జరిగింది.

ఒక సీనియర్ పోలీసు అధికారి ప్రకారం.. నిందితులలో ఒకరు 21 ఏళ్ల వ్యక్తి. బాలికకు వరుసకు మామ అవుతాడు. ఆదివ...