Telangana,hyderabad, మే 21 -- తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. ద్రోణితో పాటు ఆవర్తన ప్రభావంతో ఈ వర్షాలు కురుస్తున్నట్లు వాతావరణశాఖ తెలిపింది. మరోవైపు బంగాళాఖాతంలో రేపు(మే 22) అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని కూడా అంచనా వేసింది.

ఐఎండీ అంచనాల మేరకు అల్పపీడనం ఏర్పడితే రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇవాళ్టి నుంచి పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి. ఈ మేరకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తాజా బులెటిన్ లో వివరాలను పేర్కొంది.

ఇవాళ(మే 21) నిజామాబాద్, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం...