భారతదేశం, మే 17 -- తెలుగు ఇండిపెండెంట్ మూవీ అమృతంగ‌మ‌య డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజైంది. రొమాంటిక్ డ్రామాగా తెర‌కెక్కిన ఈ మూవీ బుక్ మై షో ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఫ్రీగా కాకుండా రెంట‌ల్ విధానంలో మేక‌ర్స్ ఈ మూవీని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొచ్చారు. 49 రూపాయ‌లు రెంట్ చెల్లించి ఈ మూవీని బుక్ మై షో యాప్‌లో చూడొచ్చు.

అమృతంగ‌మ‌య మూవీలో కిర‌ణ్ కుమార్‌, మౌనిక సామినేని హీరోహీరోయిన్లుగా న‌టించారు. ఈ మూవీకి హీరోగా న‌టించిన కిర‌ణ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. త‌మ ల‌క్ష్యాల‌ను నెర‌వేర్చుకునే క్ర‌మంలో ఓ జంట సాగించిన జ‌ర్నీ చుట్టూ ద‌ర్శ‌కుడు ఈ మూవీ క‌థ‌ను రాసుకున్నాడు.

అర్జున్‌, అమృత ఫిల్మ్ మేక‌ర్స్‌గా స్థిర‌ప‌డాల‌ని క‌ల‌లు కంటారు. ఈ క్ర‌మంలో వారిద్ద‌రు ఒక‌రికొక‌రు ఎలా అండ‌గా నిల‌బ‌డ్డారు? ఈ జ‌ర్నీలో వారికి ఎలాంటి ఒడిదుడుకులు ఎదుర‌య్యాయి అనే...