భారతదేశం, డిసెంబర్ 9 -- తిరుపతిలో హెల్మెట్ ధరించని ద్విచక్ర వాహనదారులకు డిసెంబర్ 15 నుండి పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ పోయరు. రోడ్డు ప్రమాద సంబంధిత మరణాలను తగ్గించడానికి జిల్లా పోలీసులు 'నో హెల్మెట్-నో పెట్రోల్' నియమాన్ని కఠినంగా అమలు చేయనున్నారు.
జాతీయ రోడ్డు ప్రమాదాల డేటా ప్రకారం దాదాపు 45 శాతం ప్రమాద మరణాలు ద్విచక్ర వాహనదారుల వల్లే సంభవిస్తున్నాయని ఎస్పీ సుబ్బరాయుడు తెలిపారు. అతివేగం, హెల్మెట్ లేకుండా వాహనం నడపడం ఈ మరణాలకు ప్రధాన కారణాలుగా ఉన్నాయన్నారు.
వాహనదారుడు, పిలియన్ రైడర్ ఇద్దరూ హెల్మెట్లు సరిగ్గా ధరిస్తే ఇలాంటి మరణాలలో 40 శాతం నివారించవచ్చని ఎస్పీ అన్నారు. రోడ్డు ప్రమాద మరణాలు కుటుంబంపై మానసికంగానే కాకుండా ఆర్థిక భారాన్ని కూడా కలిగిస్తాయన్నారు. దీనికి సంబంధించి, తిరుపతి జిల్లా పోలీసులు జిల్లా అంతటా పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.