భారతదేశం, సెప్టెంబర్ 26 -- గురువారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​లు నష్టాల్లో ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 556 పాయింట్లు పడి 81,160 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 166 పాయింట్లు కోల్పోయి 24,891 వద్ద సెషన్​ని ముగించింది. ఇక బ్యాంక్​ నిఫ్టీ 145 పాయింట్లు పడి 54,976 వద్దకు చేరింది.

మంగళవారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 5,097.51 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 5,105.60 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

ఇక శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​ని సూచీలు నష్టాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్​ నిఫ్టీ దాదాపు 65 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.

"నిఫ్టీ50 25000 లెవల్స్​ దిగువకు పడిపోయింది. అంటే సెంటిమెంట్​ నెగిటివ్​గా ఉన్నట్టు! 25,000- 25,050 వద్ద రెసిస్టెన్స్​ కనిపించొచ్చు. 24,700- 24,750 లెవ...