భారతదేశం, జూన్ 30 -- శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​లు లాభాల్లో ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 303 పాయింట్లు పెరిగి 84,059 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 81 పాయింట్లు వృద్ధిచెంది 25,638 వద్ద సెషన్​ని ముగించింది. బ్యాంక్​ నిఫ్టీ 237 పాయింట్లు పెరిగి 57,444 వద్దకు చేరింది.

శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 1397.02 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. అదే సమయంలో డీఐఐలు రూ. 588.93 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు.

జూన్​ నెలలో ఎఫ్​ఐఐలు ఇప్పటివరకు మొత్తం మీద రూ. 8320.48 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. అదే సమయంలో డీఐఐలు రూ. 69,176.47 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

ఇక దేశీయ స్టాక్​ మార్కెట్​లు.. సోమవారం ట్రేడింగ్​ సెషన్​ని ఫ్లాట్​గా ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్​ నిఫ్టీ దాదాపు 2...