భారతదేశం, జూన్ 12 -- జ‌బ‌ర్ధ‌స్థ్ కామెడీ షో ద్వారా కంటెస్టెంట్స్‌తో స‌మానంగా యాంక‌ర్స్ అన‌సూయ‌, ర‌ష్మి ఫేమ‌స్ అయ్యారు. చాలా కాలం పాటు ఈ షోకు హోస్ట్‌లుగా కొన‌సాగారు. సినిమాల కార‌ణంగా అన‌సూయ జ‌బ‌ర్ధ‌స్థ్‌ నుంచి త‌ప్పుకోగా...ర‌ష్మి మాత్రం హోస్ట్‌గా కంటిన్యూ చేస్తూ బుల్లితెర ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తోంది. తాజాగా ఈ కామెడీ షోలోకి మ‌రో కొత్త యాంక‌ర్ ఎంట్రీ ఇవ్వ‌బోతున్నాడు. ఆ యాంక‌ర్ మ‌రెవ‌రో కాదు...బ్ర‌హ్మ‌ముడి సీరియ‌ల్ ఫేమ్ మాన‌స్‌.

జ‌బ‌ర్ధ‌స్థ్ కు ఉన్న క్రేజ్ రానురాను త‌గ్గిపోతుండ‌టంతో ఈ షోలో భారీగా మార్పులు, చేర్పులు చేస్తోన్నారు మేక‌ర్స్‌. ఇక నుంచి ఈ షోలో ఇద్ద‌రు యాంక‌ర్లు క‌నిపించ‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ర‌ష్మితో పాటు మ‌రో యాంక‌ర్ కూడా ఈ షోలోకి ఎంట్రీ ఇవ్వ‌బోతున్న‌ట్లు వెల్ల‌డించారు. జ‌బ‌ర్ధ‌స్థ్‌లో చేయ‌బోతున్న మార్పుల‌ను సూచిస్తూ ప్రోమో...