భారతదేశం, నవంబర్ 14 -- జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ విజయం సాధించారు. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతపై 24,729 ఓట్ల తేడాతో భారీ విక్టరీని నమోదు చేశారు. ఈ విజయంతో కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు భారీగా సంబరాలు చేసుకుంటున్నారు. గాంధీభవన్ లో సందడి వాతావరణం నెలకొంది.
ఈ ఉపఎన్నిక ఫలితంపై ఎన్నికల సంఘం కాసేపట్లో అధికారికంగా ప్రకటన చేయనుంది. గెలుపొందిన అభ్యర్థికి ధ్రువీకరణపత్రం అందజేయనుంది. నవీన్ యాదవ్ ఇంటి వద్ద ఆయన అనుచరులు భారీగా సంబరాలు చేసుకుంటున్నారు.
ఈ ఉపఎన్నికలో నవీన్ యాదవ్ కు 98,988(50.83%) పోలవగా. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు 74,259(38.13%) ఓట్లు దక్కాయి. ఇక బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన దీపక్ రెడ్డికి డిపాజిట్ దక్కలేదు. కేవలం ఆయనకు 17,061(8.76%) ఓట్లు మాత్రమే పోలయ్యాయి.
2023 ఎన్నికల్లో ఇక్కడ బీఆర్ఎస్ అభ్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.