భారతదేశం, మే 18 -- హైదరాబాద్ గుల్జార్‌హౌస్‌లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో 17 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. మృతుల కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం పరిహారం ప్రకటించింది.

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్‌, దామోదర్‌ రాజనర్సింహా ఘటనాస్థలిని పరిశీలించారు. మృతులకు ఒక్కొక్కరికి రూ. 5 లక్షల చొప్పున పరిహారం ఇవ్వనున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

ఈ ప్రమాదంపై అన్ని శాఖల అధికారులతో చరిస్తూ ఎప్పటికప్పుడు సీఎం రేవంత్‌రెడ్డి పర్యవేక్షిస్తున్నారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారన్నారు.

ఆదివారం ఉదయం 6.16 గంటలకు అగ్నిమాపక సిబ్బందికి ప్రమాదం ...