భారతదేశం, ఏప్రిల్ 18 -- ఆంధ్రప్రదేశ్‌ గురుకులాల్లో 5 నుంచి 8వ‌ త‌ర‌గ‌తి వ‌ర‌కు, ఇంట‌ర్మీడియ‌ట్, డిగ్రీ ప్ర‌వేశాల‌కు సంబంధించిన ప్ర‌వేశ ప‌రీక్ష‌ల‌కు హాల్ టిక్కెట్లు విడుద‌ల అయ్యాయి. ఏప్రిల్ 25న ప్ర‌వేశ ప‌రీక్ష జ‌ర‌గ‌నుంది.

గురుకుల విద్యా సంస్థల్లో ప్రవేశాలకు 5 నుంచి 8వ త‌ర‌గ‌తి ప్ర‌వేశాల‌కు ఉద‌యం, ఇంట‌ర్మీడియ‌ట్‌, డిగ్రీ ప్ర‌వేశాల‌కు మ‌ధ్యాహ్నం ప‌రీక్ష జ‌ర‌గ‌నుంది. ఈ మేర‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్ గురుకుల విద్యాల‌యాల సంస్థ కార్యద‌ర్శి విఎన్ మ‌స్తాన‌య్య ప్ర‌క‌ట‌న విడుదల చేశారు.

5 నుంచి 8వ‌ త‌ర‌గ‌తి వ‌ర‌కు ప్ర‌వేశాల‌కు సంబంధించి ఏపీ రెసిడెన్షియల్ స్కూల్స్ కామన్ ఎంట్ర‌న్స్ టెస్ట్ (ఏపీఆర్ఎస్ సెట్-2025) నిర్వ‌హిస్తున్నామ‌ని అధికారులు తెలిపారు. ఇంట‌ర్మీడియ‌ట్ ప్ర‌వేశాల‌కు సంబంధించి ఏపీ రెసిడెన్షియల్ జూనియ‌ర్ కాలేజీ కామ‌న్ ఎంట్రన్స్ టెస్ట్‌ (ఏపీఆర్‌జేసీ...