భారతదేశం, ఫిబ్రవరి 7 -- శివమణి డ్రమ్స్ తో, రిషబ్ శర్మ వీణతో మ్యాజిక్ చేశారు. వీళ్లు సంగీత వాయిద్యాలు వాయిస్తుంటే స్టేడియం మొత్తం ఊగిపోయింది. టీ20 ప్రపంచకప్ 2026 ఓపెనింగ్ సెర్మనీ గ్రాండ్ గా జరిగింది. ఈ టీ20 ప్రపంచకప్ లో ఇండియా తన ఫస్ట్ మ్యాచ్ అమెరికాతో ఆడుతోంది. టాస్ గెలిచిన అమెరికా బౌలింగ్ ఎంచుకుంది. భారత్ ఫస్ట్ బ్యాటింగ్ చేయనుంది.

జెట్ ప్యాక్ తో ఓ వ్యక్తి గాల్లో ఎగురుతూ ప్రపంచకప్ ట్రోఫీని స్టేడియంలోకి తీసుకొచ్చాడు. దీంతో కప్ ఎగురుతూ వచ్చినట్లు అనిపించింది. ఆ తర్వాత ఐసీసీ ఛైర్మన్ జై షా, టీ20 ప్రపంచకప్ అంబాసిడర్ రోహిత్ శర్మ కలిసి ట్రోఫీని మైదానంలోకి తెచ్చారు. రోహిత్ శర్మ ట్రోఫీ పట్టుకుని నడుచుకుంటూ వచ్చాడు. వెంటనే డ్రమ్స్ మోతతో స్టేడియం మార్మోగింది. అనంతరం అమెరికా టాస్ గెలిచింది. బౌలింగ్ ఎంచుకుంది.

టాస్ వేసిన తర్వాత టీ20 ప్రపంచకప్ 2026 ఓ...