భారతదేశం, ఫిబ్రవరి 12 -- కేజీఎఫ్ స్టార్ యశ్ నటిస్తున్న పాన్- ఇండియా మూవీ 'టాక్సిక్' (Toxic) టీజర్ మరోసారి వివాదాల్లో చిక్కుకుంది. స్మశాన వాటికలో చిత్రీకరించిన ఒక సన్నివేశంపై క్రిస్టియన్ సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. సెన్సార్ బోర్డుకు ఫిర్యాదు కూడా చేశాయి. ఈ వివాదంపై బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ స్పందించాడు.

యశ్ హీరోగా, కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న భారీ యాక్షన్ మూవీ 'టాక్సిక్'. గీతూ మోహన్‌దాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా టీజర్ విడుదలైనప్పటి నుంచి ఏదో ఒక వివాదం చుట్టుముడుతూనే ఉంది. మొదట మహిళా కమిషన్ అభ్యంతరం తెలపగా, తాజాగా క్రిస్టియన్ సంఘాలు (నేషనల్ క్రిస్టియన్ ఫెడరేషన్) ఈ టీజర్‌పై మండిపడుతున్నాయి.

ఎన్‌సీఎఫ్ (NCF) ప్రతినిధులు సెన్సార్ బోర్డు, ఫిల్మ్ చాంబర్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు ఫిర్యాదు చేశారు. టీజర్‌ల...