భారతదేశం, జనవరి 5 -- అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని మలికిపురం మండలం ఇరుసుమండ గ్రామంలోని ఓఎన్‌జీసీ డ్రిల్లింగ్ సైట్ వద్ద గ్యాస్ లీక్ అయి పెద్ద ఎత్తున మంటలు చెలరేగుతున్నాయి. ఇది చూసిన గ్రామస్తులు భయాందోళనకు గురై ప్రాణాలను కాపాడుకోవడానికి పరుగులు తీశారు.

డీప్ ఇండస్ట్రీస్ కంపెనీ తవ్వకాలు చేస్తుండగా.. గ్యాస్ లీక్ అయింది. తరువాత తెల్లటి పొగమంచులా వాయువు వ్యాపించింది. మొదట్లో పొగమంచుగా తప్పుగా భావించారు. తర్వాత మంటలు వ్యాపించాయి. స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. మరోవైపు ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. చమురు వాసన వ్యాపించింది. పచ్చని కొబ్బరి చెట్లకు కూడా మంటలు అంటుకున్నాయి.

సమీపంలోని విద్యుత్ లైన్లు, ఆపరేటింగ్ ఇంజిన్ల నుండి నిప్పురవ్వలు మంటలను రేకెత్తించాయి. మలికిపురం మండల్లోని కొన్ని ప్రాంతాలను భారీ పొగ, మంటలు చుట్టుముట్టాయి. అగ...