Telangana, మే 22 -- తెలంగాణ రాజకీయాల్లో సంచలన పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రాసిన ఓ లేఖ. ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఏకంగా పార్టీ అధినేత, తండ్రి అయిన కేసీఆర్ కే ఈ లేఖను సంధించారు. పార్టీలోని పరిస్థితులను వివరించే ప్రయత్నం చేశారు. ఓవైపు పాజిటివ్ అంశాలను ప్రస్తావిస్తూనే.. మరోవైపు లోపాలను సూటిగా చూపారు. ఇందుకు సంంబంధించిన ఓ లేఖ బయటికి రావటంతో.. అసలు బీఆర్ఎస్ లో ఏం జరుగుతోంది.? కుటుంబ విభేధాలు తారాస్థాయికి చేరాయా..? మరేమైనా పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయా..? వంటి అంశాలు తెరపైకి వస్తున్నాయి.

'మై డియర్ డాడీ' అంటూ ఎమ్మెల్సీ కవిత ఆరు పేజీల లేఖ రాసినట్లు తెలుస్తోంది. పాజిటివ్, నెగెటివ్ ఫీడ్ బ్యాక్ అంటూ వివరంగా లేఖ రాశారు. ఎల్కతుర్తి సభ గురించి ఇందులో పలు అంశాలను ప్రస్తావించారు. ఓ రకంగా సభ నిర్వహణ తీరుపై అసంతృప్తిన...