భారతదేశం, మే 20 -- తెలుగు మూవీ ఎమ్‌4ఎమ్ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్ 2025లో స్ట్రీనింగ్ అయ్యింది. మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కిన ఈ మూవీలో అమెరిక‌న్ న‌టి జో శ‌ర్మ కీల‌క పాత్ర‌లో న‌టించింది. మోహ‌న్ వ‌డ్ల‌ప‌ట్ల ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. కేన్స్‌లో ఎమ్‌4ఎమ్ రెడ్ కార్పేట్ వేడుక‌పై హీరోయిన్ జో శ‌ర్మ‌తో మెరిసింది. ఈ స్క్రీనింగ్‌కు డైరెక్ట‌ర్ మోహ‌న్ వ‌డ్ల‌ప‌ట్ల కూడా అటెండ్ అయ్యాడు.

రెడ్ కార్పేట్ వేడుక‌లో దుబాయ్, ఢిల్లీలోని ప్రముఖ డిజైనర్లు రూపొందించిన దుస్తులు ధరించి అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది జో శ‌ర్మ‌. కేన్స్‌లోని ప్రెస్టీజియస్ PALAIS-C థియేటర్‌లో 'ఎం4ఎం' మూవీ రెడ్ కార్పెట్ స్క్రీనింగ్ జరిగింది. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్ 2025లో స్క్రీనింగ్ అయిన ఏకైక తెలుగు మూవీగా ఎమ్‌4ఎమ్ నిలిచింది. తెలుగు సినిమాకు ద‌క్కిన అరుదైన గౌర‌వంగా భావిస్తున్న‌ట...