భారతదేశం, జనవరి 6 -- కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్​ సీనియర్​ నేత సురేశ్​ కల్మాడి ఇకలేరు. 81 ఏళ్ల వయసులో దీర్ఘకాల అనారోగ్యంతో ఆయన మరణించినట్లు కుటుంబ సభ్యులు ధృవీకరించారు.

పుణెలోని ఎరందవనేలో ఉన్న కల్మాడీ నివాసంలో మధ్యాహ్నం 2 గంటల వరకు అభిమానుల సందర్శనార్థం ఆయన పార్థివ దేహాన్ని ఉంచుతారు. అనంతరం మధ్యాహ్నం 3:30 గంటలకు వైకుంఠ్ స్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు సురేశ్​ కల్మాడి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.

కల్మాడికి భార్య, కుమారుడు, కోడలు, ఇద్దరు కుమార్తెలు, అల్లుడు, మనవళ్లు ఉన్నారు.

సురేశ్​ కల్మాడి పుణె నగరం నుంచి పలుమార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రిగా కూడా ఆయన సేవలందించారు. కేవలం రాజకీయాలకే పరిమితం కాకుండా, భారత ఒలింపిక్ అసోసియేషన్ (ఐఓఏ) అధ్యక్షుడిగా సుదీర్ఘ కాలం పనిచేసి, జాతీయ స్థాయిలో క్రీడా పరిప...