భారతదేశం, మే 27 -- తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మౌనం ఇప్పుడు అనేక ప్రశ్నలకు దారి తీస్తోంది. ఆయన నిర్ణయాల్లోని ఊగిసలాట, స్పష్టత లేకపోవడం వల్ల పార్టీ శ్రేణులు మూడు గ్రూపులుగా విడిపోయినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. కుమారుడు కేటీఆర్, మేనల్లుడు హరీశ్ రావు, కూతురు కవిత - ఈ ముగ్గురికీ పార్టీలో సొంత బలగాలున్నాయి. నిజానికి, ఈ మూడు శక్తులు కలిసికట్టుగా ఉంటేనే బీఆర్ఎస్ బలంగా ఉంటుంది. కానీ, ప్రస్తుత పరిస్థితులు అందుకు విరుద్ధంగా ఉన్నాయి. ప్రతిపక్షంలో ఉండి ప్రభుత్వాన్ని సమర్థంగా ఎదుర్కొని పార్టీని పటిష్టపరచాల్సిన సమయంలో, అంతర్గత గ్రూపు రాజకీయాలతో బీఆర్ఎస్ బలహీనపడుతోంది.

ఇటీవలే కవిత రాసిన ఒక లేఖ బహిర్గతం కావడంతో పార్టీలోని విభేదాలు రచ్చకెక్కాయి. బీఆర్ఎస్ లో ఏదో జరుగుతోందనే వార్తలు, కథనాలు మీడియాలో తీవ్ర చర్చకు దారితీశాయి. పార్టీలో ఈ విభే...