భారతదేశం, మే 27 -- మ‌ల‌యాళం మూవీ డ్యాన్స్ పార్టీ థియేట‌ర్ల‌లో రిలీజైన ఏడాదిన్న‌ర త‌ర్వాత ఓటీటీలోకి వ‌స్తోంది. మే 30న మ‌నోర‌మా మ్యాక్స్ ఓటీటీలో ఈ మూవీ రిలీజ్ కాబోతోంది. ఈ బోల్డ్ కామెడీ మూవీ స్ట్రీమింగ్ డేట్‌ను మ‌నోర‌మా మ్యాక్స్ అఫీషియ‌ల్‌గా ప్ర‌క‌టించింది. ఓ పోస్ట‌ర్‌ను అభిమానుల‌తో పంచుకున్న‌ది.

డ్యాన్స్ పార్టీ మూవీలో శ్రీనాథ్ భాషి, షైన్ టామ్ చాకో, విష్ణు ఉన్నికృష్ణ‌న్ హీరోలుగా న‌టించారు. ప్ర‌యాగ మార్టిన్ లీనా హీరోయిన్లుగా న‌టించారు. సోహాన్ శీనులాల్ ఈ మ‌ల‌యాళం మూవీకి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

2023 డిసెంబ‌ర్‌లో డ్యాన్స్ పార్టీ మూవీ థియేట‌ర్ల‌లో రిలీజైంది. బాక్సాఫీస్ వ‌ద్ద యావ‌రేజ్‌గా నిలిచింది. బోల్డ్ ట్ర‌యాంగిల్ ల‌వ్‌స్టోరీగా ద‌ర్శ‌కుడు ఈ సినిమాను తెర‌కెక్కించారు. కాన్సెప్ట్ రొటీన్ అయినా ఈ మూవీలోని కామెడీకి మాత్రం మంచి పేరొచ్చింది.

అనికుట...