భారతదేశం, ఫిబ్రవరి 17 -- ప్రముఖ మలయాళ నటి నవ్యా నాయర్, సౌబిన్ షాహిర్ ప్రధాన పాత్రల్లో నటించిన మలయాళ క్రైమ్ థ్రిల్లర్ 'పాతిరాత్రి' (Paathirathri) ఓటీటీ విడుదలకు సిద్ధమైంది. 'పురు' (Puzhu) ఫేమ్ రతీనా పి.టి దర్శకత్వం వహించిన ఈ సినిమా జీ5 ఓటీటీ వేదికగా ఫిబ్రవరి 20 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ పోలీస్ థ్రిల్లర్ మూవీ ఎందుకు చూడాలో ఇక్కడ తెలుసుకోండి.

మలయాళ ఇండస్ట్రీ నుంచి మరో ఆసక్తికరమైన క్రైమ్ థ్రిల్లర్ ఓటీటీ ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధంగా ఉంది. ఒకప్పుడు తెలుగు, మలయాళ సినిమాల్లో హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన నవ్యా నాయర్.. విలక్షణ నటుడు సౌబిన్ షాహిర్ కలిసి నటించిన మూవీ ఈ 'పాతిరాత్రి'. థియేటర్లలో హిట్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా ఇప్పుడు డిజిటల్ ప్రీమియర్‌కు రెడీ అయ్యింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జీ5 (ZEE5) దక్కించుకుం...