భారతదేశం, ఫిబ్రవరి 17 -- పాట్నాలో జరిగిన నీట్ (NEET) విద్యార్థిని మృతి ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. దీనిపై బాలీవుడ్ నటి తాప్సీ పన్ను స్పందించింది. ఇలాంటి దారుణాలు మనకు సాధారణమైపోవడం దురదృష్టకరమని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. తన నెక్ట్స్ మూవీ 'అస్సి' (Assi) విడుదల సందర్భంగా ఆమె చేసిన వ్యాఖ్యలు, ఆ కేసు పూర్వాపరాలు ఇక్కడ చూడండి.

బీహార్‌లోని పాట్నాలో నీట్ కోచింగ్ తీసుకుంటున్న ఒక విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మరణించిన ఘటనపై బాలీవుడ్ నటి తాప్సీ పన్ను మౌనం వీడింది. ఏఎన్ఐ (ANI) వార్తా సంస్థతో మాట్లాడుతూ ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. "ఆ ఒక్క రోజే దేశవ్యాప్తంగా ఇలాంటివి మరో 79 కేసులు నమోదై ఉంటాయి. నాకు చాలా బాధగా ఉంది. మన దేశంలో సగటున రోజుకు 80కి పైగా ఇటువంటి దారుణాలు జరుగుతున్నాయి. దురదృష్టవశాత్తు, మనం ఇలాంటి కేసులకు ప్రాముఖ్యత ఇవ్వడం మ...