భారతదేశం, ఫిబ్రవరి 16 -- తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల తర్వాత ఫిబ్రవరి 16వ తేదీన కౌన్సిలర్లు, కార్పొరేటర్లు ప్రమాణ స్వీకారం చేశారు. తర్వాత మున్సిపాలిటీల్లో ఛైర్‌పర్సన్లు, వైస్ ఛైర్మన్లపై ఆసక్తి నెలకొంది. ఇక 7 కార్పొరేషన్లలో ఎవరు మేయర్ పీఠాలపై కూర్చుంటారా? అనే క్యూరియాసిటీ అందరికి ఉంది. ఇక కరీంనగర్, నిజామాబాద్ కార్పొరేషన్లలో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ మధ్య పోటీ నెలకొంది. చివరకు కరీంనగర్ కార్పొరేషన్‌పై బీజేపీ జెండా ఎగురవేసింది. మిగిలినవాటిలో ఐదు కార్పొరేషన్లలో కాంగ్రెస్ కూర్చొంది. కొత్తగూడంలో మాత్రం సీపీఐ తెరపైకి వచ్చి మేయర్ స్థానాన్ని దక్కించుకుంది.

రాష్ట్ర ఎన్నికల సంఘం తాజాగా తెలంగాణలోని ఏడు మున్సిపల్ కార్పొరేషన్లకు మేయర్లు, డిప్యూటీ మేయర్లుగా ఎన్నికైన వారి జాబితాను ప్రకటించింది. ఐదు మేయర్ పదవులు కాంగ్రెస్‌కు దక్కగా, భారతీయ జనతా పార్టీ(...