Andhrapradesh, మే 10 -- ఏపీ పాలిసెట్ - 2025 పరీక్షకు సంబంధించి అధికారులు మరో అప్డేట్ ఇచ్చారు. ఇటీవలే ప్రాథమిక కీని విడుదల చేశారు. దీని వచ్చిన అభ్యంతరాలను పరిశీలించారు. ఈ ప్రక్రియ పూర్తి కావటంతో తాజాగా ఫైనల్ కీని విడుదల చేశారు. ఏపీ పాలిసెట్ అధికారిక వెబ్ సైట్ నుంచి ఫైనల్ కీని డౌన్లోడ్ చేసుకోవచ్చని అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.

ఏపీ పాలిసెట్ - 2025 ఫలితాల విడుదలపై అధికారులు కీలక అప్డేట్ ఇచ్చారు. మే మూడో వారంలో రిజల్ట్స్ ను విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఏప్రిల్ 30వ తేదీన పాలిసెట్‌ 2025 పరీక్షను నిర్వహించారు. మొత్తం 1,57,482 మంది దరఖాస్తు చేసుకోగా.. అందులో 1,39,749 మంది పరీక్ష రాశారు. ఇందుకు 89 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు.

ఏపీ పాలిసెట్ 2025 ఎగ్జామ్ ను 120 మార్కులకు నిర్వహించారు. ఇందులో మ్యాథమెటిక్స్ నుంచి 50, ఫిజిక్స్ నుంచి 40, కెమిస్...